నగదు, నగలు దోచుకెళ్లిన దుండగులు
ఘట్కేసర్, అక్టోబర్ 16: పండుగకు సొంతూరుకి వెళ్లొచ్చేసరికి ఇల్లుగుల్ల అయిన ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అంబేద్కర్నగర్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాలు.. ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్నగర్ లో కుటుంబ సమేతంగా నివాసం ఉంటున్న కాంట్రాక్ట్ పనులు చేసే లకావత్ సంపత్ దసరా పండుగను పురస్కరించుకొని ఈనెల 12న తన సొంతూరైన జనగాం జిల్లా రఘురాథపల్లికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు.
తిరిగి బుధవారం ఉదయం అంబేద్కర్నగర్లోని ఇంటికి తిరిగిరాగా.. ఇంటి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉంది. లోపలకి వెళ్లి చూడగా వీరువా తలుపులు తెరిచి ఉండటంతో పాటు అందులోని దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన 2 తులాల బంగారు గొలుసు, రూ.41వేల నగదు చోరీకి గురి అయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.