పోలీసు కానిస్టేబుల్ మృతి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టిన దుండగులు.. దాదాపు 10 మీటర్ల దూరం అతడిని కారుతో ఈడ్చుకెళ్లారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని కానిస్టేబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఢిల్లీలోని నాంగోయ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున కానిస్టేబుల్ సందీప్ బైక్పై నిలబడి ఉండగా... వేగంగా వస్తున్న ఓ కారును గమనించి ఆపమని సిగ్నల్ ఇచ్చారు. అయితే సదరు కారు డ్రైవర్ కానిస్టేబుల్ మాటలు వినకుండా మరింత వేగంగా వచ్చి కానిస్టేబుల్ బైక్ ఢీకొట్టాడు. బైక్ కారు చక్రాల్లో ఇరుక్కోగా అలాగే దాదాపు 10 మీటర్ల దూరం వరకు సందీప్ను ఈడ్చుకెళ్లారు.
తదనంతరం కారును వదిలేసి నిందితులు పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సందీప్ను ఆసుపత్రిగా తరలించగా అతడు చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.