calender_icon.png 10 October, 2024 | 6:49 AM

బాగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో..

04-09-2024 12:36:21 AM

  1. మనస్తాపానికి గురై కూతురు ఆత్మహత్య 
  2. మెదక్ జిల్లా తూప్రాన్ ఘటన 
  3. ఒంటరితనం భరించలేక వృద్ధురాలు..

వెల్దుర్తి, సెప్టెంబర్ 3: బాగా చదువుకోవాలని తండ్రి మందలించాడని విద్యార్థిని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లో చోటుచేసుకుంది. తూప్రాన్ పరిధిలోని ఆబోతుపల్లికి చెందిన నక్కపల్లి మహేం దర్.. కూతురు శృతి (15) పదవ తరగతి చదువుతోంది. కొద్దిగా చదువులో వెనుక బడిన శృతిని శ్రద్ధగా చదువుకోవాలని మందలించి మంగళవారం ఉదయం తండ్రి మహేందర్ గేదెలు మేపేందుకు వెళ్లాడు. తండ్రి మాటలతో మనస్తాపానికి గురైన శృతి ఇంట్లో ఉరే సుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం తండ్రి ఇంటికి వచ్చి చూడగా శృతి ఉరివేసుకొని ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మాసాయిపేటలో ఓ వృద్ధురాలు...

ఒంటరితనం భరించలేక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన గౌరగల్ల పెంటమ్మ (63) కుమారుడు ఉన్నప్పటికీ ఒంటరి జీవితం గడుపుతోంది. తోడు ఎవరూ లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆగస్టు 31న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు వారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న పెంట మ్మ మంగళవారం మృతి చెందింది. ఆమె కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్‌ఐ తెలిపారు.