15 June, 2026 | 6:14 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

సఫారీ సైన్యమిదే

14-01-2025 12:00 AM

ఎన్గిడి, నోకియా రీఎంట్రీ

జోహన్నెస్‌బర్గ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సౌతాఫ్రికా 15 మందితో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. గాయాలతో జట్టుకు దూరమైన లుంగి ఎన్గిడి, నోకియా నోర్టే రీఎంట్రీ ఇచ్చారు. బవుమా సారధ్యంలోని సౌతాఫ్రికా చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌ను అఫ్గానిస్థాన్‌తో ఫిబ్రవరి 21న,  ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 25న, ఇంగ్లండ్‌తో మార్చి 1న ఆడనుంది.

గజ్జల్లో గాయం కారణంగా పేసర్ కొయెట్జీని ఎంపిక చేయలేదు. కేశవ్ మహరాజ్, షంసీ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఎంపికయ్యారు. వెస్టిండీస్, శ్రీలంకపై టెస్టు సిరీస్ విజయాలతో సౌతాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది.