calender_icon.png 17 April, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలవరం ముంపు మాటేమిటి?

09-04-2025 12:47:33 AM

ముంపుపై సమగ్ర అధ్యయనం చేయాలి

పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీలో తెలంగాణ డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని రాష్ట్ర అధికారులు డిమాండ్ చేశారు.

పోలవరం వల్ల తెలంగాణకు నష్టం జరగకుండా చూసే బాధ్యత అథారిటీపై ఉంద ని అధికారులు స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో పోలవరం ప్రాజె క్టు అథారిటీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఇంజినీరింగ్ చీఫ్ అనిల్‌కుమార్‌తో పాటు ఏపీకి చెందిన ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

పోలవరం పనుల పురోగతి, మొత్తం అంచనా వ్యయం, నిధుల సమీకరణ ఇతర కీలక అంశాలపై సమావేశంలో చర్చ సాగినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాల గుర్తింపు, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

తెలంగాణ అధికారులు ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమ అభ్యంతరాలను మరోసారి స్పష్టంగా వ్యక్తపరిచారు. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం గురించి చర్చ జరగగా, కిన్నెరసాని, ముర్రేడువాగు సహా ఇతర ఉపనదుల పరిస్థితులపై చర్చించారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఖమ్మం, భద్రాచలం పట్టణాలకు ఎదురయ్యే సమస్యలతో పాటు రామాలయం వద్ద నీటిమట్టం, మణుగూరు థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద నీటి స్థాయిలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. 

గతేడాది వచ్చిన వరదల కారణంగా ఎదురైన ముంపును దృష్టిలో ఉంచుకొని ఈ అధ్యయనం విస్తృతంగా జరగాలనే అభిప్రాయాన్ని తెలంగాణ అధికారులు వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేస్తే, తెలంగాణపై దాని ప్రభావం ఏ మేరకు ఉంటుం దో అర్థం చేసుకోవడానికి స్పష్టమైన విశ్లేషణ చేపట్టాలన్నారు. ఏపీకి సాగునీ టిని ఇచ్చే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని.. ఈ విషయంలో తాము రాజీ పడబోమని తెలంగాణ అధికారులు సమా వేశంలో స్పష్టం చేశారు.