calender_icon.png 4 October, 2024 | 6:58 AM

మూసీతో రాహుల్‌కు ఏం సంబంధం?

04-10-2024 01:39:12 AM

కుల గణన చేయాలన్నది రాహుల్‌గాంధీనే 

వీ హనుమంతరావు 

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మూసీ సుందరీకరణకు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఏం సంబధమని, బీఆర్‌ఎస్ నాయకులు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పేర్కొన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై విమర్శలు చేసే ముందు ఒకటికి, రెండుసార్లు ఆలోచించాలని హితవుపలికారు.

గురు వారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు నెహ్రు, ఇందిరాగాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ నేత అనురాగ్‌ఠాకూర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమ న్నారు. కుల గణన చేయాలని మొదటగా చెప్పింది రాహుల్‌గాంధీనేనని పేర్కొన్నారు.