calender_icon.png 24 October, 2024 | 2:17 AM

చోరీ చేసేందుకు వెళ్లి.. కరెంట్ షాక్‌కు బలై

12-09-2024 03:05:35 AM

జడ్చర్ల, సెప్టెంబర్ 11: దొంగతనానికి వెళ్లిన ఇద్దరు కరెంట్‌షాక్‌తో మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయినపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బోయిన్‌పల్లిలోని ప్రగతి సోలార్ ప్లాంట్‌లో కేబుల్‌ను చోరీ చేసేందుకు మంగళవారం రాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. అయితే సోలార్ ప్లాంట్‌లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండటంతో యాజమాన్యం ప్లాంట్ చుట్టూ రెండు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసింది.

చోరీకి వెళ్లిన వ్యక్తులు మొదటి కంచెను తొలగించి లోపలికి వెళ్లారు. రెండో కంచెను కట్ చేసే క్రమంలో కరెంట్ సరఫరా కావడంతో షాక్‌కు గురై మృతిచెందారు. మిడ్జిల్ ఎస్సై శివనాగేశ్వర్‌నాయుడు ఘటన స్థలాన్ని పరిశీంచారు. మృతుల వివరాలు కోసం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా వారితోపాటు మరో ఇద్దరు లేదా ముగ్గురు వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో మహిళలు ధరించే పట్టీలు పడి ఉండటాన్ని గుర్తించారు.