calender_icon.png 25 October, 2024 | 10:59 AM

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దివ్యాంగుల సంక్షేమం

25-10-2024 12:34:58 AM

దివ్యాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణలోని దివ్యాం గుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని దివ్యాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ ముత్తినే ని వీరయ్య స్పష్టం చేశారు. గురువా రం దివ్యాంగుల కార్పొరేషన్ కార్యాలయంలో ముత్తినేని వీరయ్య ఆధ్వర్యం లో ఉన్నతస్థాయి మేనేజ్‌మెంట్ కమి టీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. పదేళ్లలో దివ్యాంగుల పరికరాల కొనుగోలు కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రూ.64 కోట్లు మాత్రమే కేటాయించిందని, కానీ తమ ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చిన ౧౦ నెలల్లోనే రూ.50 కోట్లు కేటాయించిందన్నారు. సమావేశంలో దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన అనేక తీర్మానాలు చేశారు. సమా వేశంలో దివ్యాంగుల కార్పొరేషన్ జేఎండీ శైలజా, జీఎం ప్రభంజన్‌రావు  పాల్గొన్నారు.