calender_icon.png 23 October, 2024 | 2:05 AM

పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత

12-09-2024 01:57:31 AM

ప్రభుత విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): పోలీసుల సంక్షేమానికి అధిక ప్రా ధాన్యమిస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిర్మించిన గెస్ట్‌హౌజ్, సీసీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు. పోలీస్ శాఖ దా రా జిల్లాలో శాంతిభద్రతలను కాపాడుతూనే, యువతను సన్మార్గ ంలో నడిపించేందుకు విన్నూత కార్యక్రమా లు చేపడుతున్న ఎస్పీ అఖిల్ మహాజన్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్సైలు మారుతి, రమేష్, అంజయ్య పాల్గొన్నారు.