08-02-2025 08:55:56 PM
అర్మూర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి శనివారం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పెర్కెట్ నుంచి మామిడిపల్లి చౌరస్తా, ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని ఆయన కోరారు.