01-03-2025 12:04:59 AM
డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సన్మానసభలో సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలకే కాదు.. ఇతర దేశా తెలంగాణలో సేవలందించేలా రాష్ట్రా హెల్త్ హబ్గా మార్చాలన్నదే తమ ధ్యే సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వెయ్యి ఎకరాల్లో ఎయిర్ పోర్టుకు దగ్గరలో హెల్త్ క్యాంపస్ను నిర్మించే ఆలోచన చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో హెల్త్ టూరిజం పాలసీని తీసుకురాబోతోందన్నారు.
రాష్ట్రాన్ని హెల్త్హబ్గా మా డాక్టర్ నాగేశ్వర్రెడ్డి లాంటి వారి సహకారం ఎంతో అవసరమని తెలిపారు. శుక్రవారం రాత్రి బంజారా ఓ హోటల్లో ఏర్పాటు చేసిన పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన ఏఐజీ వ్యవస్థాపకుడు డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సన్మానసభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు కూడా అర్హుడని సీఎం కొనియాడారు. మం దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పాల్గొన్నారు.