calender_icon.png 25 October, 2024 | 5:50 AM

సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం

22-07-2024 02:08:23 AM

45 రోజుల్లో 36 రాజకీయ హత్యలన్న జగన్   

హోం మంత్రి అనిత

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): కూటమి  ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లో 36 రాజకీయ  హత్యలు జరిగాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారని, వాటిపై వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ఏపీ హోం మంత్రి అనిత పేర్కొన్నారు. ఒక వేళ సమాచారం ఇవ్వలేకపోతే ఆయనపై తాను ఎందుకు చర్యలు తీసుకోకూడదని మంత్రి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించా రు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత నాలుగు  రాజకీయ హత్యలు మా త్రమే జరిగాయని, వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలే అని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై  బురద జల్లేందుకు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండి పడ్డారు.