జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం
మూసి సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదు
నదికి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టి సుందరికరణ చేయవచ్చు
బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కార్వాన్, (విజయక్రాంతి): తన ప్రాణాలను పణంగా పెట్టి బాధితుల ఇళ్లను కూల్చివేయకుండా అడ్డుకుంటానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మూసి బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. శనివారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని రాందేవ్ కూడా లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీతో పాటు జియాగూడ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి మూసి బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.