calender_icon.png 3 October, 2024 | 4:03 AM

సమస్యలను పరిష్కరిస్తాం

03-10-2024 02:04:29 AM

ట్రిపుల్ ఐటీ వీసీ 

నిర్మల్, అక్టోబర్ 2 (విజయక్రాం తి): బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలపై ప్రత్యే క దృష్టి పెట్టినట్టు ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ అన్నారు. బుధవారం విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలి పా రు. త్వరలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పా టు చేస్తున్నట్టు వివరించారు.

మిషన్ భగీరత ద్వారా మంచినీరు అందిస్తామని, త్వరలో వేరువేరుగా ఫుడ్‌కోర్టు టెండర్లు పూర్తి చేస్తామన్నారు. ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభు త్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపా రు. నబంబర్ చివరి వారంలో బాసర స్నాతకోత్సవం నిర్వహిస్తామని తెలిపా రు. 400 మంది విద్యార్థులకు పట్టాలను పంపిణీ చే స్తామని తెలిపారు.