ఎంపీ ఈటల రాజేందర్
ఎల్బీనగర్, అక్టోబర్ 7: ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధి ఆటోనగర్ నుంచి పాత పోచంపల్లికి వెళ్లే రోడ్డు పునరుద్ధరణకు కృషిచేస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, స్థానికులతో కలిసి ఆటోనగర్లో ఉన్న పాత పోచంపల్లి రోడ్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరా బాద్, నల్లగొండ జిల్లాలను కలిపే పాతపోచంపల్లి రోడ్డును పునరుద్ధించాల్సిన అవ సరం ఉందన్నారు.
రోడ్డుకు అడ్డుగా గోడ కట్టిన సీఆర్ఐడీఏ అధికారులకు రోడ్డు హద్దులను వివరించామని కార్పొరేటర్ నర్సింహారెడ్డి వివరించారు. పోచంపల్లి రోడ్డు ను తెరిస్తే శివారు ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులను పూర్తిగా తీర్చవచ్చన్నారు.