01-03-2025 11:13:06 PM
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్...
ఎల్బీనగర్: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు ఉద్యోగాల కల్పన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఏడాదిలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదన్నారు. ఫాక్స్ కాన్ కంపెనీలో ఉద్యోగాల కల్పనలో భాగంగా మధుయాష్కీగౌడ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను శనివారం హస్తినాపురంలోని ఏఎంఆర్ కన్వెన్షన్ హల్ లో నిర్వహించారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన పలువురికి నియామక పత్రాలను మధుయాష్కీ అందజేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ నగరానికి 70 కిలోమీటర్ల పరిధిలో తమ ఉద్యోగులకు ఉచిత బస్సు, ఉచిత భోజనం, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలను కల్పిస్తూ, ఉద్యోగాలు ఇస్తున్నారని, యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఫాక్స్ కాన్ కాంపెనీలో 90 శాతం యువతులు, 10 శాతం యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ పాశం అశోక్ గౌడ్, నెలపాటి రామారావు, బుడ్డా సత్యనారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ ఆంగోతు వెంకటేశ్, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, దాము మహేందర్ యాదవ్, శశిధర్ రెడ్డి, కొండోజు శ్రీనివాస్, విద్యా రెడ్డి, ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులు మణికంఠ, లోకేశ్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.