calender_icon.png 8 October, 2024 | 8:18 PM

డ్రాగన్ ఫ్రూట్‌కు గిట్టుబాటు కల్పిస్తాం

08-10-2024 02:23:28 AM

గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 7: డ్రాగన్ ఫ్రూట్ రైతుల సమైక్య సభ్యులు సోమవారం గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డిని బాటసింగారం మార్కెట్ యార్డ్ ఆఫీసులో కలసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను మార్కెట్ చైర్మన్‌కు వివరించారు.

అనంతరం ఆయన స్పందిస్తూ.. రాష్ట్రంలో సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్స్ రైతుల సమస్యలను పరిష్కరిస్తానని అన్నా రు. డ్రాగన్ ఫ్రూట్ రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్రాగన్‌ఫ్రూట్ రైతుల సమైక్య జాతీయ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, రైతులు, అధికారులు పాల్గొన్నారు. అనంత రం అనాజ్‌పూర్ గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ దేవాలయ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో చిలుక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.