calender_icon.png 23 October, 2024 | 10:01 AM

ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందిస్తాం

18-09-2024 04:34:40 PM

కలెక్టర్ పమెల్ల సత్పతి

కరీంనగర్, (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ను పారదర్శకంగా రూపొందించాడానికి అన్ని చర్యలు తీస్కుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. బుధవారం నాడు  కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..రాబోవు గ్రామ పంచాయతీ  ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందింస్తామని అన్నారు.ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని అన్నారు.

జాబితాపై సెప్టెంబర్‌ 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని అన్నారు.9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారని,సెప్టెంబర్‌ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురించడం జరుగుతుంది అని అన్నారు.కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం, వార్డులో ఉండే విధంగా చేపట్టిన (ఓటరు మెర్జింగ్) ప్రక్రియను తో పాటు మ్యాపింగ్ ప్రక్రియ ను నూరు శాతం పూర్తి చేయాలి అని  అధికారులను ఆదేశించారు. ఓటరు జాభితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, ఓటరు జాబితా తయారులో అబ్యంతరాలు,  పిర్యాదులను సత్వరమే పరిస్కారం చూపాలి అని అన్నారు. జిల్లాలో 15 మండలాల పరిధిలో 320గ్రామ పంచాయతిల పరిధిలో 3000వార్డులున్నట్లు తెలిపారు.ఏమాత్రం అజాగ్రత్తకు తావివ్వకుండా, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూడాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్ డి ఓ మహేశ్వర్ ,కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సిరాజ్ హుస్సేన్, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బిజెపి పార్టీ ప్రతినిది తోడుపునూరి కరుణాకర్,టిడిపి పార్టీ ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య, బీ.ఎస్.పి నుండి  సిరిసిల్ల రాజయ్య ధర్మ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ నరేష్,తదితరులు పాల్గోన్నారు