12-04-2025 06:34:30 PM
మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మినీ ట్యాంక్ బండ్లను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ దగ్గర కొంత భాగంలో ఏర్పాటు చేసిన ప్రాంతంలో వేసిన రంగు జాతీయ భావం సూచించే విధంగా రూపొందుతుందని ప్రస్తుతం మొదటి దశలో పెయింటింగ్ పూర్తి కావడం జరిగిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటూ ట్యాంక్ బండ్ ను అద్భుతంగా ముందుకు సాగుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.