calender_icon.png 10 October, 2024 | 2:52 AM

అవినీతిపై విచారణ జరిపిస్తాం

10-10-2024 12:47:36 AM

వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య   

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో  వికలాంగుల కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ నాయకలు వికలాంగుల సొమ్మను కూడా వదలకుండా పంది కొక్కుల్లా దోచుకుతిన్నారని విమర్శించారు.