08-04-2025 12:00:00 AM
ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధుల తీర్మానం
కామారెడ్డి, ఏప్రిల్7 (విజయక్రాంతి): ఉద్యోగుల సత్తాను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ధర్నా కార్యక్రమానికి సిద్ధం కావాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు తీర్మానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టి జి ఏ సి సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు.
ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కార్మికులకు పెన్షనర్స్ కు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడం కోసం మా హక్కులను కాపాడుకోవడం కోసం ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ నరాల వెంకట్ రెడ్డి తెలిపారు. మే 15 న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
జూన్ 9 న రాష్ట్ర స్థాయి మహా ధర్నాకు ప్రతి ఉద్యోగస్తుడు విధిగా హైదరాబాదులో జరిగే మహాధర్నాకి హాజరై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కార్మికుల యొక్క సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘాల జేఏసీ కన్వీనర్ నరాల వెంకట్ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు టీజీవో అధ్యక్షుడు డాక్టర్ దేవేందర్, కుషాల్, ఎల్లారెడ్డి, సాయిరెడ్డి, బషీర్, బాబు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.