18-04-2025 08:18:02 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం పట్టణంలో గల 14 నంబర్ బస్తి,మ దీనా మస్జిద్ లో శుక్రవారం రోజున మొహమ్మద్ అంకుష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సదర్ ఉస్మాన్ మాట్లాడుతూ... ముస్లిముల పట్ల ఎన్డిఎ ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. హిందూ ముస్లిములకు, క్రిస్టియనులకు మధ్య చిచ్చు పెడుతూ రాజ్యం ఎలుతున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగ పరి రక్షణ మనందరి బాధ్యత అని, పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లు ను వెంటనే రద్దు చేయక పోతే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. జిల్లా ముస్లిం జెఏసీ ఆధ్వర్యంలో ఈనెల 25న తలపెట్టిన నిరసన కార్యక్రమానికి భారీగా తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలోఅహ్మద్ పాషా, మొహమ్మద్,యాకూబ్ పాషా, జానీ, ఖాజా, గౌస్, అలిమ్, గోరే, మక్బూల్, ముబీన్, హాజి, అన్మోల్ అహ్మద్ రజా, మస్జిద్ ముసల్లీలు పాల్గొన్నారు.