12-03-2025 12:25:16 AM
జిల్లా కలెక్టర్ విజయేందిరా బోయి
పరిహారం రైతులు మెచ్చేలా అందించండి: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి
మహబూబ్ నగర్ మార్చి 11 (విజయ క్రాంతి) : ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు అన్ని విధాల మేలు జరిగేలా చూస్తామని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డి తో కలిసి రెవెన్యూ,ఇరిగేషన్,సర్వే ల్యాండ్ రికారడ్స్, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్ కింద వల్లూరు, ఉదండపూర్,తుమ్మల కుంట తండా, రేగడి పట్టి తండా,చిన్నగుట్ట తండా, శామ గడ్డ తండా,ఒంటి గుడిసె తండా,పోలేపల్లి వ్యవసాయ క్షేత్రం లో ఇండ్లు, కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు అవార్డు అందుకున్న వారందరికి పునరావాసం కింద మూడు వందల గజాల స్థలం, వారి అవసరాలకు ప్రైమరీ హెల్త్ సెంటర్, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, పార్కులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ వాటర్ పైపులైన్లు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. - భూములు కోల్పోయిన వారికి అధిక పరిహారం ఇవ్వాలి : అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కొందరు అడ్డుపడుతున్నారని, భూమి కోల్పోయిన వారికి అపోహలు, భయాన్ని కలుగచేస్తున్నట్లు, ఎవరు ఆందోళన చెందవద్దని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు అన్నారు. ఉదండా పూర్ రిజర్వాయర్ లో భూమి కోల్పోయిన వారికి ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం అందేలా చూడాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడంతోపాటు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు ఉదండపూర్ రిజర్వాయర్ అర్&ఆర్ విషయంలో ఏమైనా సమస్యలు వుంటే ఆర్డీవో దృష్టికి తీసుకు రావాలని ఆయన అన్నారు. ఈ సమావేశం లో స్పెషల్ కలెక్టర్ (ఎల్. ఎ.) మధుసూదన్ నాయక్, ఆర్డీవో నవీన్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, సర్వే లాండ్ రికార్డు అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.