calender_icon.png 25 October, 2024 | 6:58 AM

అన్నదాతలకు న్యాయం చేస్తాం

25-10-2024 01:33:16 AM

*బైంసా ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్

భైంసా, అక్టోబర్ 24: భైంసా వ్యవసాయ మార్కెట్‌ను అభివృద్ధి చేసి, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడతామని ఏఎంసీ చైర్మన్ సిందే ఆనంద్‌రావుపటేల్ హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పురియా గురువారం కొత్త పాలక మండలి తో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అధ్యక్షుడు ఆనంద్‌రావుపటేల్‌తో పాటు ఉపాధ్యక్షుడు ఎండీ ఫారుక్ అహ్మద్, డైరెక్టర్లుగా డీ రామేశ్వర్, నడిమిశెట్టి భూమన్న, శేక్ మౌలామియా, తోట రాము, రాంనాథ్, సురేఖ, దేవిదాస్, కిష్టన్న, మాధవరావు, సుధాకర్‌రావు, విఠల్, దత్తురాంపటేల్‌ను మార్కెట్‌కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పూరియా, కార్యదర్శి శ్రీనివాస్, సిబ్బంది ఘనంగా సన్మానించారు.