ఎమ్మెల్సీ కోదండరాం
భీమదేవరపల్లి, సెప్టెంబరు 23: హైదరాబాద్ మాదిరిగానే వరంగల్, ఖమ్మం నగరాల్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో సోమవారం వీరభద్రుడి ఆలయాన్ని ఆయన సందర్శించి, స్వామివారిని దర్శించుకున్నారు. 12 సంవత్సరాల క్రితం రాష్ట్రం ఏర్పాటు కావాలని వీరభద్రస్వామికి ముడుపులు కట్టానని, ఆ ముడుపులు చెల్లించుకున్నానని చెప్పారు.