వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): భవిష్యత్తులో రాష్ట్రంలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మలేషియా పర్యటనలో భాగంగా గురువారం ఆయన ప్రపంచంలో అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్ పామాయిల్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్జీఈ కంపెనీ సీడ్ గార్డెన్ను సందర్శించారు.
నరర్సీలను, అధునాతన సాంకేతిక పద్ధతుల్లో ఉన్న విత్తన కేంద్రాన్ని పరిశీలించి ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీడ్ గార్డెన్ ఏర్పాటుకు ఎఫ్జీఐ కంపెనీ నిర్వహకులు కోరారని, అందుకు రాష్ట్ర భాగస్వామ్యంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.