09-03-2025 05:54:30 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాను అన్ని రంగంలో అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎస్వీఆర్ ఆసుపత్రిని ప్రారంభించారు జిల్లా కేంద్రం ఏర్పడ్డ తర్వాత వైద్యరంగం ఎంతో మెరుగుపడిందని తెలిపారు. అనంతరం నిర్మల్ లక్ష్మణ్ చందా సారంగాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వపరంగా చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంతోష్ రాజ్, రంజిత నాయకులు ఉన్నారు.