calender_icon.png 28 October, 2024 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ మార్పులో భాగస్వాములు కావాలి

28-10-2024 12:43:01 AM

  1. కార్పొరేట్ కంపెనీలు సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి
  2. పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి సీతక్క సమావేశం

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ కంపెనీలు తమ వంతు చేయూతనివ్వాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఆదివారం ప్రజాభవన్‌లో పలు కార్పొరేట్ కంపెనీలు, స్వ చ్ఛంద సంస్థలతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్, ములుగు వంటి అటవీ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. కంపెనీలు పే బ్యాక్ టు సొసైటీ నినాదం తో తమ సామాజిక బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు.

ఒక లక్ష్యంతో సీఎస్‌ఆర్ నిధులను వెచ్చిస్తే మార్పు కచ్చితంగా వస్తుందని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను, వనరులను, అవసరాలను కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలకు తెలియజెప్పేందుకు వారితో కలిసి త్వరలో బస్సుయాత్ర చేపట్టనున్నట్టు మంత్రి సీతక్క వెల్లడించారు.

కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలా చారి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు దివాకర్ టీఎస్, రాజర్షిషా, పలు కంపెనీల, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.