calender_icon.png 27 October, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగారెడ్డి హత్యపై లోతైన దర్యాప్తు కోరతాం

27-10-2024 01:27:50 AM

  1. సీఎం, డీజీపీని కలిసి దర్యాప్తు కోసం విజ్ఞప్తి చేస్తా
  2. టీపీసీసీ ప్రచార కార్యదర్శి మధుయాష్కి గౌడ్

కరీంనగర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): గంగారెడ్డి హత్య కేసును లోతుగా దర్యాప్తు చేయకుండా పాత కక్షలే ఆయన హత్యకు కారణమంటూ పోలీసులు తెలపడం విచారకరమని టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్‌తో కలిసి శనివారం ఆయన గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ప్రాణహాని ఉందని గంగారెడ్డి ముందుగానే పోలీసులకు తెలిపినప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ విషయంపై తాను సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ జితేందర్‌ని కలిసి దర్యాప్తు కోసం విజ్ఞప్తి చేస్తానని ప్రకటించారు.