calender_icon.png 18 October, 2024 | 1:59 PM

మూసీ బాధితులకు అండగా ఉంటాం

18-10-2024 12:21:14 AM

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

రాజేంద్రనగర్, అక్టోబర్ 17: మూసీ పరీవాహక ప్రాంత బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హైదర్‌గూడ, భరత్ నగర్‌లోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ రాజేంద్రనగర్ ఇన్‌ఛార్జ్జ్ తోకల శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎంపీ పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులను కలిసి మాట్లాడారు.

వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఇళ్లు కూలుస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే మూడు రెట్ల పరిహారం ఇచ్చిన తర్వాతే ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ సర్కారు కూడా మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చేసేందుకు రూ.15 వేల కోట్లు నిధులు మంజూరు చేసిందని, ఇప్పుడు ఆ పార్టీ ఆత్మరక్షణ కోసం మోసపూరిత పోరా టం చేస్తోందని ధ్వజమెత్తారు.

ఆయా ప్రాం తాల్లో అధికారులు ఎంతవరకు మార్కింగ్ చేశారు.. ఎంతవరకు ఇళ్లు పోతాయి అనే విషయం అధికారులకు కూడా తెలియడం లేదని మండిపడ్డారు. నగరంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి, వై శ్రీధర్, కొమురయ్య, గౌరీశంకర్, మల్లేశ్ యాదవ్, వేణుగోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, అమర్, చిన్న ముదిరాజ్ పాల్గొన్నారు.