మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాం తి): ఆదిలాబాద్లోని ఖానాపూర్ చెరువు ప రిధిలోని నిరుపేదల ఇండ్లను కూల్చే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని, బుల్డోజర్లకు అడ్డుగా నిలిచి పేదలకు అండగా ఉంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న స్పష్టం చేశారు. ఇటీవల అధికారుల బృందం ఖానాపూర్ చెరువు వద్ద స రే చేయడంతో భయందోళనకు గురవుతు న్న ఖానాపూర్ చెరువు బాధితులను సోమవారం ఆయన కలిసి భరోసా కల్పించారు.
కొలిపుర, తిర్పెల్లి, అంబేద్కర్ నగర్ తదితర కాలనీల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. దశాబ్దాల కాలంగా నిరుపేదలు ఇండ్లు నిర్మించుకుని జీవిస్తుంటే ప్రభుతం వారిపై దయ చూపకుండా వ్యవహరించడం సరికాదన్నారు. చెరువును కబ్జా చేశారని ఆరోపిస్తూ సరే జరపడంతో పేదలు భయందోళనకు గురవుతున్నారని ధజమెత్తారు. ఆయనవెంట నాయకులు రోకండ్ల రమేష్, అలాల్ అజయ్, సాజిదోద్దీన్, విజ్జగిరి నారాయణ, పవన్ నాయక్, ధర్మపాల్, శ్రీనివాస్, సరూప రాణి ఉన్నారు.