calender_icon.png 21 October, 2024 | 3:07 AM

మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం

21-10-2024 12:41:21 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్, అక్టోబర్ 20 : కొత్తపేట డివిజన్‌లోని జనప్రియ అవెన్యూ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, చైతన్యపురిలోని మూసీ నిర్వాసితులతో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమావేశమయ్యారు. నిర్వాసితులు మాట్లాడుతూ.. జనప్రియ కాలనీ మూసీ ఒడ్డు నుంచి 150 మీటర్ల దూరంలో ఉందని ఇక్కడ 280 కుటుంబాల్లో మొత్తం 1,000 మంది మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నామని, బ్యాంకు రుణాలు తీసుకున్నామని, ప్రభుత్వానికి ఆస్తిపన్నుతోపాటు కరెంట్, నీటి బిల్లులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. మూసీ సుందరీకరణ పేరుతో మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించనున్నట్లు వార్తలు వెలువడుతున్నట్లు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేవారు. ఎమ్మెల్యే స్పందిస్తూ మీ అందరికీ బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు.

అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్లు జిన్నారం విఠల్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు.. తోట మహేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, ఉదయ్‌గౌడ్, త్రివేది, లింగాల రాహుల్‌గౌడ్, పులికంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.