13-12-2024 01:01:03 AM
మాజీమంత్రి రామన్న
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిం చడం మానుకోవాలని మాజీ మం త్రి జోగు రామన్న పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో గురువారం మాట్లాడారు. సర్వశిక్షా అభియాన్, ఆశా వర్కర్ల సమస్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవనెత్తుతారన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వాటి అమలు దిశగా చేస్తున్న ప్రయత్నాలు శూన్యమన్నారు.