calender_icon.png 28 September, 2024 | 10:53 AM

మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

28-09-2024 01:10:25 AM

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో వక్తలు

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, సెప్టెంబర్ 27: మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు అన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్లలో అధికారులు కొండా లక్ష్మణ్  చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు పలు ప్రాంతాల్లో విగ్రహాలను ఆవిష్కరించి మాట్లాడారు.

సమాజం మార్పు కోసం, ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ముందుంటారని కొనియాడరు. ప్రత్యేక తెలంగాణ కోసం తన చివర శ్వాస వరకు ఉద్యమం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను తృణప్రాయంగా త్యాగం చేసి పార్టీలకతీతంగా నిస్వార్థంగా పోరాడిన మహనీయుడు లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.