calender_icon.png 25 October, 2024 | 9:57 AM

వాటితో జీవన గమ్యం ఏర్పరుచుకోవాలి

22-07-2024 02:05:28 AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): సత్యం, ధర్మం, ధ్యానం వంటి భక్తి మార్గాల ద్వారా జీవన గమ్యం ఏర్పరుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం మంగళగిరిలో సీకే కన్వెన్షన్ సెంటర్‌లో గురుపౌర్ణమి మహోత్సవంలో ఆయన పాల్గొని.. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు.