23-03-2025 08:32:01 PM
అందోల్: జోగిపేట్ ఎస్సీ బాలుర వసతి గృహం (ఏ) లో షాహిద్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడని కొనియాడారు. తన 23 ఏళ్ల ప్రాయంలో ఈ దేశం కోసం ఉరికాంబాన్ని ముద్దాడి బ్రిటీషర్ల నుండి స్వాతంత్రాన్ని అందించిన వీరుని గాధ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా భగత్ సింగ్ చరిత్రను పాఠ్యాంశంగా బోధించాలని ఆయన అన్నారు. భగత్ సింగ్ త్యాగం, సుఖ్దేవ్ స్నేహం, రాజ్ గురు ధీరత్వాన్ని పునికి పుచ్చుకొని వారి ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
భగత్ సింగ్ రవి అస్తమించని సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టి ఈ దేశానికి స్వాతంత్రం అందించాడని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించలని అన్నారు. దేశవ్యాప్తంగా భగత్ సింగ్ పేరుతో విశ్వవిద్యాలయలను ఏర్పాటుకు ప్రభుత్వాలను కృషి చేయాలని అన్నారు. భగత్ సింగ్ ఆశయాలను సాధించడం అంటే ఈ దేశం మతతత్వ పోకడల నుండి విప్లవ పోరాటాలకు చేయాలని అన్నారు. భగత్ సింగ్ పోరాట పట్టిమతో నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్, అనివేశ్, మల్లేష్, కుమార్, రాజు, కిరణ్, వివేక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.