16-03-2025 07:21:07 PM
డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేష్...
మునుగోడు (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన, విద్యా విధానాలకు వ్యతిరేకంగా తమ పాలన కొనసాగిస్తున్నాయని, ప్రభుత్వాలను భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని పోరాటాలకు సిద్ధం కావాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు. స్థానిక మండల కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) మునుగోడు మండల 9వ మహాసభలు కామ్రేడ్ యాసరాని శివ, వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలక ప్రభుత్వాలు యువజన రంగం పట్ల, విద్యారంగం పట్ల బడ్జెట్లో అరకోర నిధులను కేటాయిస్తూ ఈ రంగాలను నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు.
భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ స్మారక వారోత్సవాలూ నిర్వహిస్తున్నామని అందులో భాగంగా అన్ని గ్రామ, మండలాల్లో గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీలు, సభలు నిర్వహించి యువతను మంచి మార్గంలో నడిచే విధంగా చెడు మార్గంలో ప్రయాణించకుండా దిశా నిర్దేశం చేయాలని ఈ మహాసభల్లో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కార్యదర్శిలు కట్టా లింగస్వామి, మిరియాల భరత్, సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, మాజీ డివైఎఫ్ఐ నాయకులు పగిల్ల పరమేష్, పగిళ్ల యాదయ్య, డివైఎఫ్ఐ మండల నాయకులు బొడ్డుపల్లి నరేష్, చెనగోని గణేష్, ఎండి సిద్దిక్, మలిగ శివ, లింగస్వామి, శ్రీను, వెంకటేష్, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.