28-04-2025 01:45:34 AM
హైదరాబాద్, ఏప్రిల్27(విజయ క్రాంతి): నక్సలిజాన్ని తమ ప్రభు త్వం సామాజికకోణంలో మాత్రమే చూస్తుందే తప్ప, శాంతిభద్రతల అం శంగా పరిగణించదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్రం శాంతిచర్చ లు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందజేసిన వారిలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ ఉన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందన్నారు. ఈ అంశంపై సీనియర్నేత జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. మంత్రులతో చర్చించి, ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు.