కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన రైతులు
గద్వాల/వనపర్తి, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ తమకు ఇంకా అందలేదని నిరసిస్తూ శుక్రవారం పలువురు రైతులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగు తున్నా బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నడిగడ్డ హ క్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొ ంగళ్ల రంజిత్ కుమార్ రైతులకు మద్ద తు తెలిపారు. వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.