డీఎస్సీ ఫలితాలపై డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): డీఎస్సీ ఫలితాల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ను భట్టి రీట్వీట్ చేశారు. ప్రక్షాళన చేసి.. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి ఫలితాలను విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే, డీఎస్సీ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే ప్రజాప్రభుత్వం కొనసాగుతోందన్నారు.