calender_icon.png 23 October, 2024 | 5:58 PM

మేమున్నామని..

23-10-2024 01:34:30 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఇద్దరు విద్యార్థులకు సచివాలయంలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అండగా నిలిచింది. నల్లగొండకు చెందిన సీహెచ్ పవన్ తేజకు ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడం కారణంగా ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉండి దాతల కోసం ప్రయత్నించాడు. హెల్పింగ్ హాండ్స్ సంస్థను ఆశ్రయించగా మంగళవారం రూ.25వేల చెక్కును అందించారు. అలాగే నిజాం కాలేజీలో పీజీ చేస్తున్న బి.శ్రీకాంత్‌కు రూ.8వేల ఆర్థికసాయం అందించారు. సంస్థ అధ్యక్షులు తులసీదాస్ మాంగ్ పాల్గొన్నారు.