చర్లపల్లి డివిజన్ కాలనీలా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నాం : కార్పోరేటర్ బొంతు శ్రీదేవి
కాప్రా (విజయక్రాంతి): చర్లపల్లి డివిజన్ పరిధిలోని కాలనీలో సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని శుభోదయం కాలనీ, విద్యా మారుతి కాలనీలో ఆమె పర్యటించిన అనంతరం కాలనీల నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కాలనీలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. శుభోదయం కాలనీ, విద్యా మారుతీ కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో శుభోదయం కాలనీ అధ్యక్షుడు మల్లేష్, విద్యా మారుతి నగర్ కాలనీ అధ్యక్షుడు గురుసాయులతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.