calender_icon.png 19 October, 2024 | 9:57 PM

అప్పులు తీర్చేందుకు చోరీల బాట

19-10-2024 12:39:20 AM

జనగామ(మహబూబాబాద్), అక్టోబర్ 18 (విజయక్రాంతి): వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ దొంగను మహబూబాబాద్ పోలీసు లు అరెస్టు చేశారు. అతడి వద్ద రూ. 16.94 లక్షల  బంగారు ఆభరణాల ను స్వాధీనం చేసుకున్నారు. బయ్యారానికి చెందిన అంగోత్ విక్రమ్ డ్రిల్లింగ్ పనిచేసేవాడు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి అప్పులు చేశాడు. అప్పులు తీర్చేం దుకు చైన్‌స్నాచింగ్‌లు మొదలుపెట్టా డు. దొంగిలించిన ఆభరణాలను అమ్మేందుకు వెళ్తుండగా శుక్రవారం మహబూబాబాద్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద 22.4 తులాల ఆభరణాలు, స్మార్ట్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు.