calender_icon.png 23 October, 2024 | 12:49 PM

నిజాంసాగర్ ఆయకట్టుకు నీటి విడుదల

29-08-2024 03:04:57 PM

కామారెడ్డి: నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న వరి పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి గురువారం ఉదయం రెండో విడత నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద 1,15,000 ఎకరాలు సాగు చేస్తుండగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి మొదటి విడత జూన్ నెలలో 1.20 టీఎంసీల నీటిని విడుదల చేయగా ఈరోజు రెండో విడత వేదిక నీటిని ప్రధాన కాలువ ద్వారా విడుదలను ప్రారంభించినట్లు ఏ ఈ శివప్రసాద్ తెలిపారు రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతన్నలకు ఆయన కోరారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80, టీఎంసీల కుగాను 1391.80 అడుగులు 4.80, టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు