27-03-2025 01:07:27 AM
బాన్సువాడ, మార్చి 26 (విజయక్రాంతి) : జిల్లా కోర్టు ఆవరణంలోని బార్ అసోసియేషన్ హాల్ లోవాటర్ డిస్పెన్సర్లను జిల్లా జడ్జి సునీతా లంచాల తొ కలిసి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తొ కలిసి ప్రారంభించారు. బుధవారం రోజు జరిగిన ఈ కార్యక్రమం అనంతరం జిల్లా జడ్జి సునీతా కుంచాల మాట్లాడుతూ న్యాయవాది బాబు వాటర్ డిస్పెన్సర్స్ అధించడం అభినదనీయం అన్నారు.
వేసవి కాలం లో బార్ అసోసియేషన్ ఇలాంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కక్షిదారులు న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జ్ కోరారు, న్యాయవాది జేవిఆర్ బాబు తన తండ్రి స్వర్గీయ లక్ష్మీరాజ్యం(పూర్వ న్యాయవాది) తల్లి అనసూయ జ్ఞాపకార్థం ఈ రోజు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కి నాలుగు వాటర్ డిస్పెన్సెర్ డొనేట్ చెయ్యడం.
బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ న్యాయవాది జె వి ఆర్ బాబు.కు అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంత్ రావు న్యాయవాది జేవీఆర్ బాబు శ్రీమతి చార్టెడ్ అకౌంటెంట్ సవిత, సీనియర్ అడ్వకేట్స్ ఆర్.జగదీశ్వర్ రావు కిరణ్ కుమార్ గౌడ్ ఆర్ రాజలింగం,కృపాకర్ రెడ్డి,రాజ్కుమార్ సుబేదర్ విశ్వక్ సేవ్ తదితరులు పాల్గొన్నారు..