calender_icon.png 11 October, 2024 | 5:03 AM

సింగూరుకు జలకళ

04-09-2024 12:20:07 AM

ప్రాజెక్టులో 20.811 టీఎంసీల నీటి నిల్వ

సంగారెడ్డి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మంజీరాపై ఉన్న సింగూర్ ప్రాజెక్టులోకి  భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 20.811 టీఎంసీల వద్ద ఉంది. ఇన్‌ప్లో 26,326 క్యూసెక్కులు కాగా, ఔట్ ప్లో 401 క్యూసెక్కులు. సంగారెడ్డి మండలంలోని కల్పగూర్ గ్రామంలో ఉన్న మంజీరా బరాజ్ పూర్తిస్థాయి నీటి సామ ర్థ్యం ఒకటిన్నర టీఎంసీలు కాగా, ప్రస్తుతం వరద పోటు ఉండడంతో అధికారులు ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బీ)లోని నారింజ ప్రాజెక్టు పూర్తిగా నిండింది.