హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): హుస్సేన్ సాగర్ నుంచి 6,200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించినట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యం లో, వ్యర్థాల తొలగింపునకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా వ్యర్థా ల తొలగింపు చేపడుతుండగా, బుధవారం నాటికి 6,200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తొలగింపు పూర్తయినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్ వ్యాప్తంగా ప్రధా న రహదారులు, ఇతరత్రా ప్రాంతా ల్లో గురువారం మొత్తం 713 వాహనాల ద్వారా 9,145 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించి, తరలించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.