ముంబై: వరల్డ్ పికిల్ బాల్ చాంపియన్షిప్లో తొలిసారి పాల్గొంటున్న భారత్ సత్తా చాటింది. తొలి రోజే రెండు స్వర్ణాలతో పాటు రెండు రజతాలు కైవసం చేసుకుంది. భారత ఆటగాడు వాన్షిక్ మూడు పతకాలతో మెరవడం విశేషం. తొలుత పురుషుల సింగిల్స్లో స్వర్ణం సాధించిన వాన్షిక్ ఆ తర్వాత పురుషుల డబుల్స్లో తేజాస్తో కలిసి రజతం.. మిక్స్డ్ డబు ల్స్లో వృశాలీతో కలిసి రజతం గెలుచుకున్నాడు. ఇక 35 ప్లస్ డబుల్స్ సెక్షన్లో ఇషా లకానీతో జత కట్టిన వాన్షిక్ ఈసారి పసిడి నెగ్గడం విశేషం.