నిజామాబాద్, ఆగస్ట్ 29 (విజయక్రాంతి): జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో వాకథాన్ నిర్వహించారు. ఏటా ఆగస్ట్ 29న ధ్యాన్చంద్ జయ ంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతుంటారు. జాతీయ క్రీడా ది నోత్సవం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫిట్నెస్ ఇండియా కార్యక్రమా ల్లో భాగంగా గురువారం స్టేట్ బ్యా ంక్ ఆఫ్ ఇండియా వాకథాన్ నిర్వహించినట్టు బ్యాంక్ డిప్యూటీ జన రల్ మేనేజర్ బిజయ్కుమార్ సా హు తెలిపారు. మన జీవనశైలి బాగుండాలంటే శారీరక శ్రమ అవసరమని అన్నా రు. ఈ కార్యక్రమంలో నిజామాబా ద్ రీజనల్ మేనేజర్ మహేశ్వర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.