తిమ్మాపూర్, ఫిబ్రవరి 5: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి కళాశాలలో ఇన్ఫోసిస్ కంపెనీ సారధ్యంలో నిర్వహించిన ప్రాంగణ నియామ కాలలో ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని కళాశాల జనరల్ సెక్రెటరీ డా. గండ్ర శ్రీనివాస్ రెడ్డి బుధవారం తెలిపారు.
ఈ సందర్భంగా జనవరి 27న ఇన్ఫోసిస్ కంపెనీ విద్యా ర్థులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన సి ఎస్ ఈ కి చెందిన డి. యశస్విని, బి.శ్రా వణి, టి. పావని, విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారన్నారు.
అనంతరం ఎంపికైన విద్యా ర్థులను కళాశాల జాయింట్ సెక్రెటరీ డా. డి. శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు వినోద్, సిహె ప్రకాష్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ సిహె శ్రీనివాస్, ఈ ఎస్ ఈ విభాగాధిపతి డా. ఎన్ చంద్రమౌళి, శ్రీకాంత్ రెడ్డి ప్లేస్మెంట్ ఆఫీసర్ సతీష్ రెడ్డి,లలు విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.